ఏప్రిల్ 21న పెళ్లి.. మూడో రోజే ఆ నవ వరుడు అదృశ్యం.. నాలుగు రోజుల తర్వాత షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2022-04-27T18:19:49+05:30 IST

ఆ యువకుడికి ఈ నెల 21వ తేదీన అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.. పెళ్లి జరిగిన మూడో రోజు నుంచి అతను కనిపించ లేదు..

ఏప్రిల్ 21న పెళ్లి.. మూడో రోజే ఆ నవ వరుడు అదృశ్యం.. నాలుగు రోజుల తర్వాత షాకింగ్ సీన్..!

ఆ యువకుడికి ఈ నెల 21వ తేదీన అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.. పెళ్లి జరిగిన మూడో రోజు నుంచి అతను కనిపించ లేదు.. దీంతో కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికారు.. ఫలితం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. నాలుగు రోజుల తర్వాత ఆ గ్రామంలోని బావిలో ఆ యువకుడి మృతదేహం తేలుతూ కనిపించింది.. షాకైన కుటుంబ సభ్యులు మృతదేహంతో ధర్నాకు దిగారు. 


రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలోని దౌసా గ్రామానికి చెందిన ధారా సింగ్ అనే యవకుడు ఈ నెల 21వ తేదీన సంజన అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన మూడో రోజు ధారా సింగ్ అదృశ్యమయ్యాడు. దాంతో కుటుంబ సభ్యులు అతడి కోసం తీవ్రంగా అన్వేషించారు. అయినా అతడి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల తర్వాత ధారా సింగ్ మృతదేహం గ్రామంలోని ఓ బావిలో లభ్యమైంది. షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. 


తమ కుమారుడిని హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ హత్య గురించి గ్రామంలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వధువు బాయ్‌ఫ్రెండ్ ఈ హత్య చేశాడని కొందరు ఆరోపిస్తున్నారు.  

Updated Date - 2022-04-27T18:19:49+05:30 IST