బర్త్ డే పార్టీ కోసం రాత్రి బయటకు వెళ్లిన యువకుడు.. ఉదయం అతడిని ఓపెన్ ప్లాట్లో ఊహించని విధంగా చూసి..
ABN , First Publish Date - 2022-01-23T02:34:30+05:30 IST
అతడికి 28ఏళ్లు. ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని ఇంట్లో చెప్పి, బయటకు వెళ్లాడు. ఉదయం ఓపెన్ ప్లాట్లో అతడిని ఊహించని విధంగా చూసి కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. స్థానికంగా చర్చనీయాంశం అయి
ఇంటర్నెట్ డెస్క్: అతడికి 28ఏళ్లు. ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని ఇంట్లో చెప్పి, బయటకు వెళ్లాడు. ఉదయం ఓపెన్ ప్లాట్లో అతడిని ఊహించని విధంగా చూసి కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. స్థానికంగా చర్చనీయాంశం అయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్లోని లక్నో ప్రాంతానికి చెందిన సందీప్ పాల్(28) శుక్రవారం సాయంత్రం వరకూ కుటుంబ సభ్యులతో ఉన్నాడు. బర్త్డే పార్టీ ఉందని ఇంట్లో చెప్పి రాత్రి వేళ బైక్పై బయటకు వెళ్లాడు. పుట్టిన రోజు వేడుకల కోసం వెళ్లిన కుమారుడు తిరిగి వస్తాడని అర్ధరాత్రి వరకూ అతడి తల్లిదండ్రలు ఎదురు చూసి... నిద్రపోయారు. శనివారం ఉదయం ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో సందీప్ పాల్ విగతజీవిగా పడి ఉన్నట్టు తెలుసుకుని కంగుతిన్నారు. ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా విలపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా సందీప్ పాల్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమకు శత్రువులు ఎవరూ లేరని పోలీసులకు వెల్లడించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న అధికారులు.. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.