అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా పాడె పై నుంచి సడన్‌గా లేచి మంచినీళ్లు తాగాడు.. ఆస్పత్రికి తీసుకెళ్తే..

ABN , First Publish Date - 2022-04-21T20:28:06+05:30 IST

అతనికి మంగళవారం సాయంత్రం గుండెపోటు వచ్చింది.. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు..

అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా పాడె పై నుంచి సడన్‌గా లేచి మంచినీళ్లు తాగాడు.. ఆస్పత్రికి తీసుకెళ్తే..

అతనికి మంగళవారం సాయంత్రం గుండెపోటు వచ్చింది.. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.. చికిత్స చేసిన వైద్యులు బుధవారం ఉదయం చనిపోయినట్టు నిర్ధారించారు.. దీంత కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుని స్మశానానికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.. ఆ సమయంలో అతను పాడె పై నుంచి లేచాడు.. కొడుకు నీళ్లు పట్టిస్తే తాగాడు.. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.. అయితే ఈ సారి హాస్పిటల్‌కు తీసుకెళ్లే సరికి అతను నిజంగానే చనిపోయాడు. 


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలోని ధార్‌కు చెందిన సంతోష్ (52) అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు సంతోష్‌ను వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. బుధవారం ఉదయం సంతోష్ చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు అతడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. మృతదేహాన్ని పాడెపై ఉంచి స్మశానానికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 


ఆ సమయంలో హఠాత్తుగా సంతోష్ పాడె పై నుంచి లేచాడు. కొడుకు మంచి నీళ్లు పట్టిస్తే తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే సంతోష్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే హాస్పిటల్‌కు తీసుకెళ్లే సమయానికి సంతోష్ ప్రాణాలు పోయాయి. 


Updated Date - 2022-04-21T20:28:06+05:30 IST