road accident : చెట్టును ఢీకొన్న కారు...ఇద్దరి దుర్మరణం

ABN , First Publish Date - 2021-07-26T19:02:25+05:30 IST

వేగంగా వస్తున్న కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిత్ బరగాంలో జరిగింది....

road accident : చెట్టును ఢీకొన్న కారు...ఇద్దరి దుర్మరణం

బల్లియా (ఉత్తరప్రదేశ్): వేగంగా వస్తున్న కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిత్ బరగాంలో జరిగింది. బక్సర్ నుంచి బల్లియాకు కారులో వస్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆదిల్(21), సమీర్(20)లు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అతి వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2021-07-26T19:02:25+05:30 IST