అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-04-23T05:15:06+05:30 IST
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన ఇది.
ఏన్కూరు, ఏప్రిల్ 22: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన ఇది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కేసుపల్లి గ్రామంలో బుధవారం రాత్రి రమే్ష (32)అనే వ్యక్తి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన తమ్ముడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని దీనిపై విచారణ చేయాలని మృతుడి అన్న గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.