ఉరివేసుకొని వ్యక్తి బలవన్మరణం

ABN , First Publish Date - 2021-05-09T05:03:37+05:30 IST

కడుపులో నొప్పి తాళలేక ఉరివేసుకొని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఉరివేసుకొని వ్యక్తి బలవన్మరణం

రఘునాథపాలెం, మే 8: కడుపులో నొప్పి తాళలేక ఉరివేసుకొని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన  మండల పరిధిలోని పడమటితండాలో జరిగింది. ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం పడమటితండాకు చెందిన బోడా లక్ష్మణ్‌(35) కొంతకాలంగా కడుపులో నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం తీవ్రమైన కడుపునొప్పిని భరించలేక  ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకున్నాడు. భార్య సునిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2021-05-09T05:03:37+05:30 IST