గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-05-15T06:12:09+05:30 IST
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన తాడికొండ అడ్డరోడ్డు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
తాడికొండ, మే 14: గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన తాడికొండ అడ్డరోడ్డు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు రూరల్ మండలం గొల్లవారిపాలెంకు చెందిన నాగండ్ల గిరిధర్(30)కు మతిస్ధితిమితం లేదు. దీంతో ఊరూరా తిరుగుతూ ఉంటాడు. ఈ నేపధ్యంలో తాడికొండ అడ్డరోడ్డు నుంచి అమరావతి వైపు శుక్రవారం తెల్లవారుజామున రోడ్పుఐ నడుచుకుంటు వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా గిరిధర్ తలకు తీవ్ర గాయమవటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. మృతుని తండ్రి సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.