అనారోగ్యంతో వివాహిత మృతి

ABN , First Publish Date - 2021-07-23T04:28:02+05:30 IST

మండల కేంద్రమైన బూర్గంపాడుకి చెందిన విజయలక్ష్మీ(28)గురువారం ఆనారోగ్యంతో మృతి చెందింది.

అనారోగ్యంతో వివాహిత మృతి
తెప్ప సహాయంతో మృతదేహాన్ని వాగు దాటిస్తున్న వెంకన్న మిత్రబృందం

రెండేళ్ల క్రితం భర్త కన్నుమూత

అనాథలైన ఇద్దరు కుమారులు

తెప్పల సాయంతో వాగు దాటించి మృతదేహానికి అంత్యక్రియలు

బూర్గంపాడు, జూలై 22: మండల కేంద్రమైన బూర్గంపాడుకి చెందిన విజయలక్ష్మీ(28)గురువారం ఆనారోగ్యంతో మృతి చెందింది. మృతురాలికి ఇరువురు కుమారులు. మృతురాలి భర్త తాగుడికి బానిసై రెండు సంవత్సరాలు క్రితం భార్య పిల్లలను వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో మృతురాలు తన కుమారులతో కలిసి తన పుట్టింట్లో ఉంటుంది. మృతురాలి తల్లి సైతం ఆనారోగ్యం కారణంగా గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. ఈ క్రమంలో మృతురాలి బంధువులు అందుబాటులో లేకపోవడంతో గ్రామానికి చెందిన గుండె వెం కన్న యూత్‌ ఆధ్వర్యంలో విజయలక్ష్మికి అంత్యక్రియలు నిర్వహించారు. విజయలక్ష్మీ మృతితో కుమారులు ఆనాథలయ్యారు.

వాగు దాటి అంతక్రియలు..

మూడు రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో మృతదేహానికి ఆంత్యక్రియలు నిర్వహించే క్రమంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దోమలవాగులో తెప్ప సహాయంతో మృతదేహాన్ని వాగు దాటించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వివాహిత మృతదేహానికి ప్రాణాలకు తెగించి వాగు దాటి అంత్యక్రియలు నిర్వహించిన వెంకన్న మిత్రబృందాన్ని పలువురు ఆభినందించారు.


Updated Date - 2021-07-23T04:28:02+05:30 IST