విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి

ABN , First Publish Date - 2020-11-30T04:44:48+05:30 IST

ఆరిలోవ, నవంబరు 29: ఇక్కడి దుర్గాబజార్‌కు సమీపంలోని పాండురంగాపురంలో ఆదివారం విద్యుదాఘాతానికి గురై ఒక మహిళ మృతి చెందింది.

విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి

ఆరిలోవ, నవంబరు 29: ఇక్కడి దుర్గాబజార్‌కు సమీపంలోని పాండురంగాపురంలో ఆదివారం విద్యుదాఘాతానికి గురై ఒక మహిళ మృతి చెందింది. ఆరిలోవ ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం పాండురంగాపురంలో అనసూయ (50) అనే మహిళ కుటుంబంతో మూడో అంతస్థులో ఉంటుంది. ఇంటికి సున్నాలు వేస్తున్న క్రమంలో ఇనుప నిచ్చెనను పైకి లాగుతుండగా ఇంటి పైనున్న హైటెన్షన్‌ వైర్లు తగలడంతో ఆమె విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. స్థానికంగా పాన్‌షాపు నిర్వహిస్తున్న ఆమెకు భర్త, కుమార్తె ఉన్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి సీఐ ఇమాన్నుయల్‌ రాజు ఆధ్వరంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.


Updated Date - 2020-11-30T04:44:48+05:30 IST