చెరువులో పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-12-03T05:41:49+05:30 IST

తంతడి చెరువులో పడి బుధవారం ఓ వ్యక్తి మృతిచెందాడు.

చెరువులో పడి వ్యక్తి మృతి

అచ్యుతాపురం, డిసెంబరు 2 : తంతడి చెరువులో పడి బుధవారం ఓ వ్యక్తి మృతిచెందాడు. గ్రామానికి చెందిన పట్నాల పైడిరాజు (45) చెరువులో ఉన్న తన గేదెలను బయటకు పంపేందుకు తాను కూడా దిగాడు. ప్రమాదవశాత్తు అందులో చిక్కుకుని మృంది చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతని తండ్రి, తాత కూడా కొంత కాలం క్రితం ఇదే చెరువులో ఇదే విధంగా మృతిచెందారని గ్రామస్థులు తెలిపారు. 

Updated Date - 2020-12-03T05:41:49+05:30 IST