ఈతకెళ్లిన బాలుడి మృతి
ABN , First Publish Date - 2022-07-02T07:38:59+05:30 IST
ఈతకెళ్లిన ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు.
చంద్రగిరి, జూలై 1: ఈతకెళ్లిన ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. చంద్రగిరి మండలంలోని అగరాలకు చెందిన సురేష్, భవిత దంపతులకు సిద్ధార్థ, పునీత్ అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిలో పునీత్ మూడో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు బ్యాంకు పని నిమిత్తం చంద్రగిరికి వెళ్లారు. ఆ సమయంలో అన్నదమ్ములు ఈత కొట్టడానికి ఇంటి సమీపంలోని చేపలకుంటలో దిగారు. పునీత్ కుంటలో మునిగిపోవడంతో భయపడిన సిద్ధార్థ ఇంటికొచ్చాడు. తల్లిదండ్రులు ఇంటికొచ్చాక పునీత్ నీటికుంటలో మునిగిపోయాడని చెప్పడంతో వారెళ్లి కుమారుడిని బయటకు తీశారు. తొలుత చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి, ఆపై తిరుపతి రుయాస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చంద్రగిరి పోలీసులు తెలిపారు.