మాజీ జడ్జి డీఎస్‌ ప్రసాద్‌ హఠాన్మరణం

ABN , First Publish Date - 2020-07-06T09:58:32+05:30 IST

జిల్లా మాజీ జడ్జి డీఎస్‌ ప్రసాద్‌ గుండెపోటుతో హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆదివారం మృతి చెందారు.

మాజీ జడ్జి డీఎస్‌ ప్రసాద్‌ హఠాన్మరణం

హైదరాబాద్‌ సిటీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా మాజీ జడ్జి డీఎస్‌ ప్రసాద్‌ గుండెపోటుతో హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆదివారం మృతి చెందారు. విజయనగరం జిల్లాకు చెందిన ప్రసాద్‌ 1973లో న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. నల్లగొండ, చిత్తూరు, కడప జిల్లాల ప్రధాన న్యాయమూర్తిగా, సేల్స్‌ ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. 2000లో పదవీ విరమణ చేశారు. పూర్వ న్యాయాధికారుల సంఘం తరఫున వైవీ రామకృష్ణ, రాందాస్‌ ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. 

Updated Date - 2020-07-06T09:58:32+05:30 IST