గుడిపూడి శ్రీహరి మృతి పట్ల చంద్రబాబు విచారం
ABN , First Publish Date - 2022-07-06T08:37:19+05:30 IST
సీనియర్ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వెలిబుచ్చారు.
అమరావతి, జూలై5 (ఆంధ్రజ్యోతి): సీనియర్ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వెలిబుచ్చారు. మంగళవారం ట్విటర్ వేదికగా శ్రీహరి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘తెలుగు సినిమా రివ్యూ అనగానే గుర్తొచ్చే పేరు గుడిపూడి శ్రీహరి. అధ్యాపక వృత్తి నుంచి జర్నలిజం వైపు వచ్చిన శ్రీహరి కీర్తి పురస్కార గ్రహీతగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందార’ని కొనియాడారు.