ఉపాధ్యాయుల మృతి

ABN , First Publish Date - 2021-04-19T04:53:51+05:30 IST

గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కరోనాతో ఆదివారం మృతిచెందారు. మునిసిపల్‌ స్కూల్‌లో ఎస్‌జీటీగా పనిచేస్తున్న ఆయన కొద్దిరోజుల కిందట కరోనాబారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. ఇటీవల పరిషత్‌ ఎన్నికల్లో సైతం విధులు నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉ

ఉపాధ్యాయుల మృతి




జియ్యమ్మవలస: మండలంలో ఓ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కరోనాతో ఆదివారం మృతిచెందారు. మునిసిపల్‌ స్కూల్‌లో ఎస్‌జీటీగా పనిచేస్తున్న ఆయన కొద్దిరోజుల కిందట కరోనాబారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. ఇటీవల పరిషత్‌ ఎన్నికల్లో సైతం విధులు నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

 సీతానగరం(బొబ్బిలి): బొబ్బిలి మునిసిపల్‌ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఆదివారం కరోనాతో మృతిచెందాడు. గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు విశాఖలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైరస్‌ నిర్థారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఆదివారం మృతిచెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 


Updated Date - 2021-04-19T04:53:51+05:30 IST