ప్రభుత్వ వైఫల్యం వల్లే మరణాలు: శైలజానాథ్
ABN , First Publish Date - 2022-03-17T00:42:37+05:30 IST
ప్రభుత్వ వైఫల్యం వల్లే కల్తీసారా మరణాలు సంభవించాయని ఏపీసీసీ చీఫ్
పశ్చిమ గోదావరి: ప్రభుత్వ వైఫల్యం వల్లే కల్తీసారా మరణాలు సంభవించాయని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. కల్తీసారా బాధితులను ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. నాటుసారా లేదని ప్రభుత్వం అంటోందని, మరి సారా అమ్ముతున్నట్లు 30 మందిపై కేసులు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెం ఘటనపై జ్యుడీషియల్ విచారణ చేయించాలన్నారు. శవ రాజకీయాలు చేసే అలవాటు వైసీపీకి ఉందని, కాంగ్రెస్కు కాదని ఆయన పేర్కొన్నారు.