నలుగురు డిగ్రీ విద్యార్థుల డిబార్
ABN , First Publish Date - 2021-07-25T05:44:27+05:30 IST
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి సెమిసర్ పరీక్షల్లో శనివారం నలుగురు విద్యార్థులు డిబార్ అయ్యారని పరీక్షల విభాగం డీన్, ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్ తెలిపారు.
కర్నూలు(అర్బన్), జూలై 24: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి సెమిసర్ పరీక్షల్లో శనివారం నలుగురు విద్యార్థులు డిబార్ అయ్యారని పరీక్షల విభాగం డీన్, ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్ తెలిపారు. 19,689 మంది విద్యార్థులకు గాను 17,635 మంది హాజరైనట్లు తెలిపారు. రావూస్ డిగ్రీ కళాశాల ఎమ్మిగనూరులో ఒకరు, శ్రీరామ్ డిగ్రీ కళాశాల ఆళ్లగడ్డలో ఒకరు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్యాపిలిలో ఇద్దరు విద్యార్థులు కాపీయింగ్ చేశారని తెలిపారు.