తగ్గుతున్న అప్పులు... అనీల్ అంబానీకి ఒకింత ఊరట...

ABN , First Publish Date - 2021-06-19T02:57:34+05:30 IST

రుణభారాన్ని తగ్గించుకునే దిశగా... అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ కంపెనీ... ‘రిలయన్స్ పవర్’... అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో సంప్రదింపులు జరుపుతోంది.

తగ్గుతున్న అప్పులు... అనీల్ అంబానీకి ఒకింత ఊరట...

 ముంబై : రుణభారాన్ని తగ్గించుకునే దిశగా... అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ కంపెనీ... ‘రిలయన్స్ పవర్’... అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం పవర్ కంపెనీకి ఉన్న రుణాలు 79 శాతం మేర తగ్గించుకునేందుకు యత్నిస్తోంది. ఈ ఏడాదిలో రూ. 1,400 కోట్ల నుంచి రూ. 300 కోట్లకు రుణభారాన్ని... అంటే 79 శాతం మేర తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది.


కంపెనీ ఇన్వెస్టర్లతో పాటు... తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు ఇచ్చేవారి వేటలో ఉంది. ఇన్వెస్టర్లు అప్పును టేకొవర్ చేసి వాటాల తీసుకునేందుకు వచ్చినా. లేదా... రుణాలను తక్కువ వడ్డీ రేటుతో రీ షెడ్యూల్ చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తోంది. కంపెనీ తనకున్న విండ్ పవర్ కేంద్రాన్ని కూడా విక్రయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని సింగ్లీలో 45 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు ఉంది. దీని అమ్మకం ద్వారా రూ. 200 కోట్లు సమకూరతాయని అంచనా. రిలయన్స్ ఇన్ ఫ్రా కంపెనీ గత కొంతకాలం రుణభారాన్ని తగ్గించుకునేప్రయత్నాల్లో ఉంది.


కొద్ది నెలల్లోనే దాదాపు 15 శాతం వరకు తగ్గించుకుంది కూడా. మార్చి చివరి నాటికి కంపెనీ అప్పులు రూ. 24 214 కోట్లు కాగా.. ప్రస్తుతం ఇది రూ. 20,625 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ మరో రూ. 3,200 కోట్లు తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రమోటర్ల వాటా సంస్థ తన పేరెంట్ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రిఫరెన్షియల్ షేర్లు, వారెంట్లు జారీ చేయడం ద్వారా రూ. 1,325 కోట్లు సమీకరించింది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా ఇతర ప్రమోటర్ల సంయుక్త వాటా... 9 శాతం నుండి 38 శాతానికి పెరుగుతుంది.


ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాన్ని తిరిగి చెల్లించడం ద్వారా మొత్తం వడ్డీ వ్యయం రూ. 3 వేల కోట్లు చెల్లించింది. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో కంపెనీ వడ్డీ రూపంలో రూ. 620 కోట్లను చెల్లించింది. గతేడాది ఇదే కాలానికి ఇది రూ. 759 కోట్లుగా ఉంది. రుణ తగ్గింపు డ్రైవ్ సరైన దిశలో ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2021-06-19T02:57:34+05:30 IST