అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో రుణమాఫీ
ABN , First Publish Date - 2022-05-22T05:23:40+05:30 IST
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్ అన్నారు.
- కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్
- బండలింగంపల్లిలో రైతు రచ్చబండ
ఎల్లారెడ్డిపేట, మే 21: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో శనివారం రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ సభలో రాహుల్గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ను గడపగడపకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో టీపీసీసీ రైతు రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. జిలాల్లో మొదటిసారి బండలింగంపల్లిలో చేపట్టామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు మేలు జరిగే పథకాలను ప్రవేశ పెట్టి అన్నదాతలకు ఆదుకుంటామని అన్నారు. అనంతరం ఇంటింటా తిరుగుతూ డిక్లరేషన్ పత్రాలను అందజేశారు. గ్రామంలో రచ్చబండ నిర్వహించి రైతులు, వివిధ రంగాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతు రచ్చబండను నిర్వహించి డిక్లరేషన్ పత్రాలను అందించి అన్నదాతల అభ్యున్నతికి పాటుపడతామన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సయ్య, గౌస్, శ్రీనివాస్రెడ్డి, బుచ్చాగౌడ్, రాములు, బాబు, రవి, నాగరాజు, ఇమాం, బాలుయాదవ్, దేవయ్య, శ్రీకాంత్రెడ్డి, హైమద్ తదితరులు పాల్గొన్నారు.