తరిగిపోతున్న అటవీసంపద

ABN , First Publish Date - 2021-03-04T05:58:42+05:30 IST

అటవీ అధికారులు నిద్రమత్తులో ఉండడంతో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో స్మగ్లర్లు పెట్రేగిపోతున్నారు.

తరిగిపోతున్న అటవీసంపద
యంత్రాల సహాయంతో కోతకు గురైన టేకుచెట్లు

అత్యాధునిక యంత్రాల సహాయంతో టేకుచెట్ల కోత

దస్తూరాబాద్‌, మార్చి 3 : అటవీ అధికారులు నిద్రమత్తులో ఉండడంతో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో స్మగ్లర్లు పెట్రేగిపోతున్నారు. భారీ టేకు వృక్షాలు నేల కొరుగుతున్నాయి. దీంతో అటవీసంపద తరిగిపోతుంది. కడెం రేంజ్‌ పరిధిలోని దస్తూరాబాద్‌ సెక్షన్‌లోని దస్తూరాబాద్‌ బీట్‌లోని అటవీప్రాంతంలో టేకు చెట్లకు రక్షణ కరువైంది. దాదాపు 10 నుండి 15 భారీ టేకు చెట్లు స్మగ్లర్ల చేతుల్లో సరికి వేతకు గురయ్యాయి. స్మగ్లర్లు ఆధునిక యంత్రాల సహాయంతో స్మగ్లర్లు భారీ వృ క్షాలు కోయడం, టేకు ెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నా గుర్తించకపోవడం అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. కొద్ధి రోజుల నుండి టేకు చెట్లను నరికి వేసినప్పటికీ వాటిని గుర్తించకపోవడంలో విఫలమయ్యారు అని పలువురు పేర్కొంటున్నారు. వారే స్మగ్లర్ల దగ్గర మామూలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2021-03-04T05:58:42+05:30 IST