
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) క్యాంపస్లోని అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి కుళ్లిన మృతదేహం లభ్యమైంది. మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది.ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం...చెట్టుపై వేలాడుతూ మృతదేహం ఉందని శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు కాల్ రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.మృతదేహం బాగా కుళ్లిపోయిందని, అతను చనిపోయి కొన్ని రోజులయ్యిందని పోలీసులు తెలిపారు. మృతుడికి 40-45 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మరణించిన వ్యక్తిని ఇంకా గుర్తించలేదు. ఈ మృతదేహం విద్యార్థిదేనా, అధ్యాపకుడిదా లేక బయటి వ్యక్తిదేనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఫోరెన్సిక్ బృందాన్ని సంఘటనా స్థలానికి రప్పించారు.జేఎన్యూ క్యాంపస్ లో చెట్టుకు మృతదేహం వేలాడిన ఘటన సంచలనం రేపింది.
ఇవి కూడా చదవండి