ధనలక్ష్మిగా.. ఉమాదేవి!
ABN , First Publish Date - 2022-10-02T09:56:25+05:30 IST
ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలపర్రులోని ఉమా నీలకంఠేశ్వరస్వామి పంచాయతన క్షేత్రంలో దసరా వేడుకల్లో భాగంగా
ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలపర్రులోని ఉమా నీలకంఠేశ్వరస్వామి పంచాయతన క్షేత్రంలో దసరా వేడుకల్లో భాగంగా ఉమాదేవి అమ్మవారిని శనివారం రూ.నాలుగు కోట్ల కరెన్సీతో ధనలక్ష్మీదేవిగా అలంకరించారు. నాలుగు రాష్ట్రాల్లోని బ్యాంకుల నుంచి కొత్త కరెన్సీని తెప్పించి, అలంకరణ పూర్తి చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. - నిడమర్రు