పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలి
ABN , First Publish Date - 2022-05-26T05:22:37+05:30 IST
కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజల్పై సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటి ధరలను తగ్గించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.
పీలేరు, మే 25: కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజల్పై సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటి ధరలను తగ్గించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. పీలేరులోని నాలుగు రోడ్ల కూడలిలోని పెట్రోల్ బంకు వద్ద బుధవారం టీడీ పీ నాయకులు గంటపాటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ రాజంపేట పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి కోటపల్లె బాబురెడడ్డి, పీలేరు మండల టీడీపీ అధ్యక్షుడు వారణాశి శ్రీకాంతరెడ్డి మాట్లాడుతూ దేశంలోనే రాష్ట్రంలో పెట్రోల్, డీజల్ ధరలు అధికంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజల్పై సుంకాన్ని తగ్గిస్తే ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు కంచి సూరి, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు రెడ్డప్పరెడడ్డి, నాయకులు పురం రామ్మూర్తి, స్పోర్ట్ప్ మల్లి, లక్ష్మీకర్, రహంతుల్లా, రియాజ్, ముబారక్, సురేష్, రవినాయక్, శివ, చంద్రయ్య