సబ్స్టేషన్ను పరిశీలించిన డీఈఈ
ABN , First Publish Date - 2021-07-25T07:14:26+05:30 IST
కనిగిరి ట్రాన్స్కో డీఈఈ సత్యనారాయణ శనివారం ముండ్లమూరు సబ్స్టేషన్ను శనివారం సందర్శించారు.
ముండ్లమూరు, జూలై 24 : కనిగిరి ట్రాన్స్కో డీఈఈ సత్యనారాయణ శనివారం ముండ్లమూరు సబ్స్టేషన్ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశమయ్యారు. వినియోగ దారులకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. మండలంలో ఎక్కడా లోఓల్టేజి సమస్య లేకుండా చూడాలన్నారు. ఏదైనా విద్యుత్ లైన్లు మరమ్మత్తులకు గురైతే వెంటనే చేపట్టాలన్నారు. కార్యక్రమంలో దర్శి ఏడీఈ హరి ప్రసాదు, ఏఈలు భూరాజు వీరబ్రహ్మం, ప్రసాదరావు, అశోక్, లైన్ ఇన్స్పెక్టర్ ఎస్ సాంబయ్య, లైన్మెన్ ఆంజనేయులు, నారాయణ, నాయక్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నలుగురు లైన్మెన్లు బదిలీ
మండలంలో విద్యుత్శాఖలో లైన్మెన్గా పని చేస్తున్న నలుగురు వివిధ ప్రాంతాలకు బదిలీ అయినట్లు ఏఈ భూరాజు తెలిపారు. మారెళ్లలో లైన్మెన్గా పని చేస్తున్న ఆంజనేయులు పూరిమెట్లకు, ఈదరలో లైన్మెన్గా పని చేస్తున్న బీ సోమ్లానాయక్ పసుపుగల్లుకు, ముండ్లమూరులో పని చేస్తున్న నారాయణ మర్రిపూడి మండలానికి, పసుపుగల్లులో పని చేస్తున్న కోటేశ్వరరావు మారెళ్లకు, ఇక తాళ్లూరు మండలంలో పనిచేస్తున్న కే వెంకటసుబ్బయ్యను ముండ్లమూరుకు బదిలీ చేసినట్టు ఏఈ తెలిపారు. వీరు శనివారం విధుల్లో చేరినట్లు తెలిపారు.