ఆక్సిజన్‌ సరఫరా పెంచాలని దీక్ష

ABN , First Publish Date - 2021-05-11T03:52:10+05:30 IST

ఆక్సిజన్‌ సరఫరాను పెంచి కొవిడ్‌ బాధితుల ప్రాణాలను కపాడాలని బీజేపీ నేత మిడతల రమేష్‌ సోమవారం తన నివాసంలో దీక్ష చేశారు.

ఆక్సిజన్‌ సరఫరా పెంచాలని దీక్ష
దీక్ష చేస్తున్న మిడతల రమేష్‌

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) , మే 10: ఆక్సిజన్‌ సరఫరాను పెంచి కొవిడ్‌ బాధితుల ప్రాణాలను కపాడాలని బీజేపీ నేత మిడతల రమేష్‌ సోమవారం తన నివాసంలో దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిపడా ఆక్సిజన్‌ అందుబాటులో లేక పోవడంతో జిల్లాలో కరోనా మరణాలు పెరుగుతున్నాయన్నారు. ప్రైవేటు కొవిడ్‌ వైద్యశాలల్లో చికిత్సకు తగినన్ని ఆక్సిజన్‌ సిలిండర్లు లేవన్నారు. హోమ్‌ఐసోలేషన్‌లో ఉన్న  వారి సిలిండర్లకు ఆక్సిజన్‌ నింపాలంటే కలెక్టర్‌ అనుమతులు తప్పనిసరి అంటున్నారని, ప్రాణాపాయ స్థితిలో ఉంటే కలెక్టర్‌ వద్దకు  ఎలా వెళ్లి అనుమతులు తెచ్చుకుంటారని ప్రశ్నించారు. వెంటనే ప్రజలకు ఆక్సిజన్‌ అందేలా చర్యలు చేపట్టాలని, వైద్యశాలల్లో బెడ్లు పెంచాలని డిమాండ్‌ చేశారు.  దీక్షలో జె. శ్రీకృష్ణ, సంద్య, లక్ష్మి, వెంకట నరసయ్య, నవీన్‌  పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T03:52:10+05:30 IST