AP News: తిరుమల కొండపై అన్యమత గుర్తులు: దీపక్ రెడ్డి
ABN , First Publish Date - 2022-09-27T21:21:52+05:30 IST
తిరుమల కొండపై అన్యమత గుర్తులు కనబడుతున్నాయని, బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం జరుగుతోందని...
అమరావితి (Amaravathi): తిరుమల కొండపై అన్యమత గుర్తులు కనబడుతున్నాయని, బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి (Deepak Reddy)వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా తిరుమల (Tirumala) లడ్డూలు యదేచ్ఛగా పంచారన్నారు. సీఎం జగన్ (CM Jagan)... హిందూ సమాజంపై, సాంప్రదాయాలపై చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. అన్యమతస్థుడైన జగన్ తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాలన్నారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేటప్పుడు సతీసమేతంగా వెళ్లాలని, హిందువుల మనోభావాల్ని, దేవాలయాలను కాపాడాలన్నారు. జగన్, ఆయన సోదరి షర్మిల (Sharmila) వివాహాలు క్రిష్టియన్ సాంప్రదాయంగా జరిగిందని, అందుకే వారు అన్యమతస్థులని అన్నారు. లోటస్ పాండ్లోని జగన్ ఇంటిపై ఏసుక్రీస్తు క్రాస్ మార్క్ పెద్ద ఆకారంలో ఉందన్నారు. సోనియాగాంధీ, అబ్దుల్ కలాంలు డిక్లరేషన్పై సంతకం పెట్టినప్పుడు జగన్ ఎంతటివారన్నారు. అంతర్వేదిలో ఘటన జరిగితే సీబీఐ ఎంక్వైరీ చేయిస్తామని చెప్పి ఇంతరకు చేయించలేదని దీపక్ రెడ్డి విమర్శించారు.