ముదురుతున్న వివాదం
ABN , First Publish Date - 2022-06-26T14:24:01+05:30 IST
అమరావతి: ప్రభుత్వం, సినిమా థియేటర్ యాజమాన్యాల మధ్య వివాదం ముదిరింది. ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయాలకు సంబంధించిన ఎంవోయూపై సంతకాలు చేయాలని
అమరావతి: ప్రభుత్వం, సినిమా థియేటర్ యాజమాన్యాల మధ్య వివాదం ముదిరింది. ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయాలకు సంబంధించిన ఎంవోయూపై సంతకాలు చేయాలని యాజమాన్యాలపై రెవెన్యూ అధికారుల ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఇందుకు యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. కాగా ఇప్పటికే జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది.
సోమవారం సాయంత్రంలోపు సంతకాలు చేయాలని తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్లపై అధికారులు ఒత్తిడి చేస్తుడంగా..మంగళవారం నుంచి థియేటర్లను మూసివేయాలని తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలుగు ఫిలింఛాంబర్కు ఎగ్జిబిటర్లు సమాచారం పంపారు. ఎంవోయుపై సంతకాలు చేయటం కంటే థియేటర్లో మూసివేయడం మే మంచిదన్న నిర్ణయానికొస్తున్నారు కొందరు ఎగ్జిబిటర్లు. ఇదే బాటను మరికొన్ని జిల్లాల ఎగ్జిబిటర్లు అనుసరించే అవకాశం ఉంది.