మైనర్పై అత్యాచారం కేసులో నిందితుడికి జైలు, జరిమానా
ABN , First Publish Date - 2022-06-29T12:41:21+05:30 IST
జిల్లా కోర్టులు మైనర్పై అత్యాచారం జరిపిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్
హైదరాబాద్/రంగారెడ్డి: జిల్లా కోర్టులు మైనర్పై అత్యాచారం జరిపిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. మైనర్కు నిందితుడు రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది కొంగర రాజిరెడ్డి కథనం ప్రకారం... ఒడిశాకు చెందిన మహ్మద్ రషీద్ 2015 అక్టోబర్ 18న మైనర్పై అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు విచారించిన న్యాయమూర్తి తిరుపతి మంగళవారం తీర్పుచెప్పారు.