డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2021-10-14T13:36:24+05:30 IST
డిగ్రీ, పీజీ, ఎంబీఏ కోర్సుల ప్రవేశ గడువును..
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ, ఎంబీఏ కోర్సుల ప్రవేశ గడువును పొడిగించింది. ఆలస్య రుసుము రూ.200తో అక్టోబర్ 20 వరకూ ఈ కోర్సుల్లో చేరవచ్చని వర్సిటీ అధికారులు తెలిపారు. ఇతర వివరాలు www.braouonline.in వెబ్సైటులో ఉన్నాయని.. 7382929570/580, 040-23680290/291/294/295 ఫోన్ నంబర్లలో కూడా సంప్రదించవచ్చని సూచించారు.