పెళ్లి చేసుకుందామని రోజూ వేధిస్తున్నాడంటూ చాన్నాళ్లుగా దాచిన నిజాన్ని భర్తకు చెప్పిందా భార్య.. సమస్య తీరుతుందనుకుంటే..
ABN , First Publish Date - 2021-11-17T16:22:22+05:30 IST
దేశరాజధాని ఢిల్లీలో యాసిడ్ బాధితురాలు 12 రోజుల పాటు..
దేశరాజధాని ఢిల్లీలో యాసిడ్ బాధితురాలు 12 రోజుల పాటు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరి శ్వాస తీసుకుంది. బాధితురాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మహిళ మృతి చెందిన అనంతరం ఆమె భర్త, పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. దీంతో వారి ఆరోగ్యం కూడా దిగజారింది. నిందితునికి ఉరిశిక్ష విధించాలని బాధితురాలి భర్త డిమాండ్ చేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవంబరు 3న మోంటూ అనే యువకుడు ఈ మహిళ చేతులు కట్టేసి, ఆమెపై యాసిడ్ పోశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలు అప్పటి నుంచి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
బాధితురాలికి 2011లో వివాహమయ్యింది. భర్త, ముగ్గురు పిల్లలతో పాటు ఆమె పూఠ్ఖుర్ద్లో ఉంటోంది. నిందితుడు మోనూ తరచూ ఆ మహిళ వెంట పడుతూ తనను వివాహం చేసుకోవాలని వేధిస్తున్నాడు. మొదట్లో ఆమె ఆ యువకుని మాటలు పట్టించుకోనప్పటికీ, ఆ తరువాత ఈ విషయాన్ని భర్తకు తెలియజేసింది. ఇంతలో నవంబరు 3న మోంటూ ఆ మహిళపై యాసిడ్ దాడి చేశాడు. అనంతరం నిందితుడు బక్సర్కు పారిపోయాడు. కాగా నిందితుడు ఆ మహిళ భర్తను హత్య చేసేందుకు తుపాకీ కూడా కొనుగోలు చేశాడు. నిందితుడిని పోలీసులు బీహార్లో అరెస్టు చేసి, జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.