కేజ్రీవాల్ వ్యాఖ్యల వివాదంపై ఢిల్లీ సీఎంఓ వివరణ

ABN , First Publish Date - 2021-04-23T20:41:32+05:30 IST

ప్రధాని మోదీతో సమావేశంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు, వాటిని ఆమ్..

కేజ్రీవాల్ వ్యాఖ్యల వివాదంపై ఢిల్లీ సీఎంఓ వివరణ

న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో సమావేశంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు, వాటిని ఆమ్ ఆద్మీ పార్టీ టెలికాస్ట్ చేయడం వివాదం కావడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వివరణ ఇచ్చింది. ప్రధానితో సమావేశం ప్రసారం చేయరాదని లిఖితపూర్వకంగా కానీ, మౌఖికం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి తమకెలాంటి ఆదేశాలు లేనందున సీఎం ప్రసంగాన్ని లైవ్‌లో షేర్ చేశామని తెలిపింది. ప్రజాప్రాధాన్యత గల అంశాల విషయంలో ఎలాంటి దాపరికాలు ఉండవని, అలాంటి ప్రజాప్రాధాన్యం కలిగిన విషయాలను గతంలోనూ లైఫ్ చేసిన సందర్భాలు ఉన్నాయని సీఎంఓ వివరణ ఇచ్చారు. లైవ్ ప్రసారం వల్ల ఎవరికైనా ఒకవేళ అసౌకర్యం కలిగినట్లయితే ఇందుకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని కూడా సీఎంఓ ఆ ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2021-04-23T20:41:32+05:30 IST