Delhiలో పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు...ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-04-21T12:36:20+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది....

Delhiలో పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు...ఒకరి మృతి

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో కొవిడ్ పాజిటివిటీ రేటు 5.7 శాతానికి పెరిగింది. బుధవారం ఒక్కరోజే 1,009 మందికి కరోనా వైరస్ సోకగా, ఒకరు ఇన్ఫెక్షన్ తో మరణించారు.ఢిల్లీలో ప్రస్థుతం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,641కి పెరిగింది.మరో 314 మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఢిల్లీలో కరోనా మార్గదర్శకాలను అమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. 5 రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది. 


Updated Date - 2022-04-21T12:36:20+05:30 IST