delhiలోని ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-06-29T13:47:36+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని మంగోల్‌పురిలోని ఫేజ్-1 ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది....

delhiలోని ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం

ఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని మంగోల్‌పురిలోని ఫేజ్-1 ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది.ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం 26 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి.ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది.శనివారం కూడా దేశ రాజధానిలోని రోహిణి జైలు వెనుక బాద్లీ ప్రాంతంలోని ప్లాస్టిక్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.


మే నెలలో ముండ్కాలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఈ అగ్నిప్రమాద సంఘటన జరిగిన తర్వాత 27 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో 22 మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబాలకు అప్పగించారు. నాలుగు అంతస్తుల భవనాన్ని బహుళ కంపెనీలకు కార్యాలయాలుగా ఉపయోగించారు.ప్రమాదం జరిగిన భవనంలో ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్ లేదు. ఈ సంఘటనపై ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఒక సెక్షన్ అధికారితో సహా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది.ఈ అగ్ని ప్రమాదం కేసులో భవన యజమానులు హరీష్ గోయల్, వరుణ్ గోయల్‌లకు మే 23న ఢిల్లీ కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీ ఇచ్చింది. 

Updated Date - 2022-06-29T13:47:36+05:30 IST