భవన నిర్మాణ కార్మికులకు Free Bus Passes

ABN , First Publish Date - 2022-05-05T01:04:28+05:30 IST

దేశ రాజధానిలోని భవన నిర్మాణ కార్మికులకు Aravind kejriwal సర్కార్ చల్లటి కబురు..

భవన నిర్మాణ కార్మికులకు Free Bus Passes

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని భవన నిర్మాణ కార్మికులకు Aravind kejriwal సర్కార్ చల్లటి కబురు చెప్పింది. నిర్మాణరంగ కార్మికుల రోజువారీ ప్రయాణాలకు ఉచిత బస్ పాస్‌లు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారంనాడు తెలిపారు. ఢిల్లీ సెక్రటేరియట్‌లో జరిగిన కార్యక్రమంలో కొందరు construction workersకు ఆయన ఉచిత పాస్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో 10 లక్షల మంది వర్కర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు చెప్పారు. గత ఏడాది కాలంలో ప్రభుత్వ వివిధ సంక్షేమ పథకాల కింద వీరికి రూ.600 కోట్లు పంపిణీ చేసిందని, దేశంలోనే ఇంత అత్యధిక మొత్తంలో కార్మికులకు లబ్ధి చేకూర్చిన క్రెడిట్ తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు.


కార్మికులకు ప్రభుత్వమే ఉచిత బస్సు పాస్‌లు ఇస్తున్నందున దానికి వెచ్చించే సొమ్మును వారు వృథా చేయకుండా తమతమ కుటుంబాలకు వెచ్చించాలని ఆయన సూచించారు. ప్రయాణాల రూపేణా కార్మికులు ప్రతినెలా రూ.1000 నుంచి రూ.3000 ఖర్చు చేస్తుంటారని, ప్రభుత్వం ఉచిత బస్ పాస్‌ సౌకర్యం కల్పిస్తున్నందున రాష్ట్రంలోని 10 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని Manish sisodia చెప్పారు.

Read more