అడుక్కొనో, అప్పుచేసో ఆక్సిజన్‌ ఇవ్వాల్సిందే: హైకోర్టు

ABN , First Publish Date - 2021-04-22T07:40:31+05:30 IST

దేశ రాజధానిలో కరోనా రోగుల చికిత్సకు ఆక్సిజన్‌ కొరతపై ఢిల్లీ హైకోర్టు బుధవారం మండిపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో అడుక్కొనో, అప్పుచేసో లేదా దొంగతనమైనా చేసి హస్తిన ప్రజలకు ఆక్సిజన్‌ను అందించాల్సిన బాధ్యత కేంద్రంపైనే...

అడుక్కొనో, అప్పుచేసో ఆక్సిజన్‌ ఇవ్వాల్సిందే: హైకోర్టు

దేశ రాజధానిలో కరోనా రోగుల చికిత్సకు ఆక్సిజన్‌ కొరతపై ఢిల్లీ హైకోర్టు బుధవారం మండిపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో అడుక్కొనో, అప్పుచేసో లేదా దొంగతనమైనా చేసి హస్తిన ప్రజలకు ఆక్సిజన్‌ను అందించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని స్పష్టం చేసింది. ‘‘ప్రజల ప్రాణాలంటే మీకు లెక్క లేకుండా పోయింది. ఓ వైపు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. మరోవైపు మీరు పరిశ్రమల గురించి ఆలోచిస్తున్నారు. ఒక్క ఢిల్లీ అనే కాదు.. మొత్తం దేశంలో ఆక్సిజన్‌ సరఫరా విషయంలో మీరేం చేస్తున్నారో మాకు తెలియాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

Updated Date - 2021-04-22T07:40:31+05:30 IST