తిరుమలలో ఢిల్లీ ఐఐటీ బృందం
ABN , First Publish Date - 2021-12-02T21:07:36+05:30 IST
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లు
తిరుమల: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో ఢిల్లీ ఐఐటీ బృందం పర్యటించింది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని బృందం పరిశీలించింది. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించడం, కొండచరియలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ప్రత్యామ్నాయ రోడ్డు మార్గంపై తీసుకోవలసిన చర్యలపై టీటీడీకి ఐఐటి బృందం నివేదిక సమర్పించనుంది.