ఢిల్లీ,మధ్యప్రదేశ్‌లలో వర్షాలు...ఆరంజ్ అలర్ట్ జారీ

ABN , First Publish Date - 2022-01-22T16:45:53+05:30 IST

ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్టరు వర్షాలు కురుస్తున్నాయి....

ఢిల్లీ,మధ్యప్రదేశ్‌లలో వర్షాలు...ఆరంజ్ అలర్ట్ జారీ

న్యూఢిల్లీ: ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్టరు వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 19 జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో భారతవాతావరణశాఖ (ఐఎండీ) ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్, శివపురి, గుణ, దాటియా, అశోక్ నగర్, షియోపూర్, మోరీనా, భిండ్, నీముచ్, మందసౌర్, రాజఘడ్, రాల్టం, అగర్ మల్వా, విదీషా, టికంఘడ్, చత్రాపూర్, దామోహ్, సాగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. దీంతో పాటు ఢిల్లీ, ఎన్సీఆర్, ఘజియాబాద్, ఇందిరాపురం, చాపరౌలా, దాద్రి, గ్రేటర్ నోయిడా, గురుగ్రాం, ఫరీదాబాద్, మానేసర్, కురుక్షేత్ర. కైథాల్, నర్వానా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ శనివారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది. 


Updated Date - 2022-01-22T16:45:53+05:30 IST