Pet Dog మొరిగిందని దారుణం.. ఇనుపరాడ్తో కుటుబంపై దాడి.. వీడియో వైరల్!
ABN , First Publish Date - 2022-07-05T01:36:06+05:30 IST
ఒక కుటుంబానికి చెందిన పెంపుడు కుక్క తనను చూసి మొరిగిందని ఓ వ్యక్తి అమానవీయంగా ప్రవర్తించాడు.
ఒక కుటుంబానికి చెందిన పెంపుడు కుక్క తనను చూసి మొరిగిందని ఓ వ్యక్తి అమానవీయంగా ప్రవర్తించాడు. ఆ కుటుంబంపై ఐరన్ రాడ్తో దాడి చేశాడు. రాజధాని ఢిల్లీలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన అక్కడి సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ప్రాంతంలో రక్షిత్ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క ధరమ్ వీర్ దహియా అనే వ్యక్తిని చూసి మొరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ధరమ్ ఇనుప రాడ్ తీసుకుని దాడికి ప్రయత్నించాడు.
ఆ సమయంలో ధరమ్ను కుక్క కరిచింది. వెంటనే ధరమ్ ఇనుప రాడ్తో కుక్కను కొట్టాడు. దీంతో ఆ కుక్క వెంటనే కింద పడిపోయింది. ఆ తర్వాత మరో వ్యక్తిని కొట్టగా అతను కూడా కింద పడిపోయాడు. ఆ తర్వాత రక్షిత్తో పాటు మరొక మహిళను కూడా కొట్టాడు. ఈ ఘటన మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై కుక్క యజమాని రక్షిత్ పశ్చిమ్ విహార్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.