భార్యను చంపి పోలీసుస్టేషనులో లొంగిపోయిన భర్త

ABN , First Publish Date - 2022-02-03T17:32:40+05:30 IST

భార్యను అత్యంత దారుణంగా చంపిన భర్త పోలీసుస్టేషనుకు వచ్చి లొంగిపోయిన ఘటన ఢిల్లీలో గురువారం ఉదయం జరిగింది....

భార్యను చంపి పోలీసుస్టేషనులో లొంగిపోయిన భర్త

న్యూఢిల్లీ: భార్యను అత్యంత దారుణంగా చంపిన భర్త పోలీసుస్టేషనుకు వచ్చి లొంగిపోయిన ఘటన ఢిల్లీలో గురువారం ఉదయం జరిగింది. తుగ్లకాబాద్ ఎక్స్ టెన్షన్ ప్రాంతానికి చెందిన ఓ భర్త గురువారం ఉదయం ఢిల్లీలోని గోవింద్ పురి పోలీసుస్టేషనుకు వచ్చి లొంగిపోయాడు. తన భార్యను కత్తెరతో పొడిచి చంపానని చెప్పి భర్త పోలీసుల ముందు లొంగిపోయాడు. తాను ఇంట్లో ఉన్న ప్రెజర్ కుక్కర్, సిలిండరు, కత్తెరతో భార్యను చంపానని నిందితుడైన భర్త పోలీసులకు చెప్పాడు.పోలీసులు భార్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కత్తెర, కుక్కర్, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. భార్య దారుణ హత్య ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Updated Date - 2022-02-03T17:32:40+05:30 IST