విద్యుత్ సంక్షోభంపై కేజ్రీవాల్ ట్వీట్.. మోదీకి లేఖ

ABN , First Publish Date - 2021-10-10T00:44:19+05:30 IST

విద్యుత్ సంక్షోభంపై కేజ్రీవాల్ ట్వీట్.. మోదీకి లేఖ

విద్యుత్ సంక్షోభంపై కేజ్రీవాల్ ట్వీట్.. మోదీకి లేఖ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనవచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ట్వీట్ చేశారు. ఈ బొగ్గు కొరత అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ లేఖ రాశారు. ఆగస్టు, సెప్టెంబర్ 2021 నుంచి బొగ్గు కొరత పరిస్థితులు కొనసాగుతున్నాయని, వరుసగా మూడవ నెలలో కూడా బొగ్గు కొరత కొనసాగుతుందని కేజ్రీవాల్ తెలిపారు. ఈ పరిస్థితిలో తన వ్యక్తిగత జోక్యాన్ని కోరుతూ ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే ప్లాంట్లకు తగిన బొగ్గును మళ్లించాలని కేజ్రీవాల్ అభ్యర్థించారు.

Updated Date - 2021-10-10T00:44:19+05:30 IST