Delhi: సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయిన హెడ్ ‌కానిస్టేబుల్

ABN , First Publish Date - 2022-07-23T01:59:51+05:30 IST

ఈస్ట్ ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో శుక్రవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ నరేందర్ సర్వీస్ రివాల్వర్‌తో..

Delhi: సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయిన హెడ్ ‌కానిస్టేబుల్

న్యూఢిల్లీ: ఈస్ట్ ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో శుక్రవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది.   ఢిల్లీ పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ నరేందర్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని అక్కడికక్కడే చనిపోవడం సంచలనమైంది. మధ్యాహ్నం 12.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని డీసీపీ (ఈస్ట్) కశ్యప్ తెలిపారు. లక్ష్మీనగర్ పోలీస్ కాలనీలోని పార్కింగ్ ఏరియాలోని కారులో నరేందర్ కూర్చుని తనపై తానే కాల్పులు జరుపుకొన్నట్టు చెప్పారు. లక్ష్మీనగర్ పోలీస్ స్టేషన్‌లోని క్రైమ్ బ్రాంచ్ సిబ్బందికి ఆ శబ్దాలు వినిపించినట్టు చెప్పారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. 

Updated Date - 2022-07-23T01:59:51+05:30 IST