ఢిల్లీలో పెరిగిన కోవిడ్ కేసులు, 23 మంది మృతి

ABN , First Publish Date - 2022-01-12T01:13:24+05:30 IST

ఢిల్లీలో పెరిగిన కోవిడ్ కేసులు, 23 మంది మృతి

ఢిల్లీలో పెరిగిన కోవిడ్ కేసులు, 23 మంది మృతి

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మళ్లీ కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. మంగళవారం రోజు కొత్తగా ఢిల్లీలో 21,000 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా వల్ల 23 మంది చనిపోయినట్లు వైద్య అధికారులు తెలిపారు. సోమవారం రోజు 19,166 కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీలో రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు 25.65 శాతంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. నగరంలో కోవిడ్ -19 యాక్టివ్ కేసులు 9,000కి పైగా పెరిగాయని, ప్రస్తుతం 74,881కి చేరుకున్నాయని ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2022-01-12T01:13:24+05:30 IST