ఢిల్లీలో ఒకే రోజు 28,867 కోవిడ్ కేసులు నమోదు, ఇదే అత్యధికం

ABN , First Publish Date - 2022-01-14T03:22:47+05:30 IST

ఢిల్లీలో ఒకే రోజు 28,867 కోవిడ్ కేసులు నమోదు, ఇదే అత్యధికం

ఢిల్లీలో ఒకే రోజు 28,867 కోవిడ్ కేసులు నమోదు, ఇదే అత్యధికం

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజువారీగా భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో గురువారం రోజు 28,867 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి అత్యధికంగా ఒక్కరోజులోనే భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల 31 మంది మరణించారని, పాజిటివిటీ రేటు 29.21 శాతంగా నమోదైంది. ఢిల్లీలో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 94,160కు చేరింది. గత 24 గంటల్లో 22,000 మందికి పైగా కోలుకున్నారు. దాదాపు 99,000 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.

Updated Date - 2022-01-14T03:22:47+05:30 IST