తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ దీక్ష ప్రారంభం
ABN , First Publish Date - 2022-04-11T16:57:09+05:30 IST
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం దీక్ష ప్రారంభమైంది.
న్యూఢిల్లీ: తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం దీక్ష ప్రారంభమైంది. ‘‘తెలంగాణ రైతుల పక్షాన నిరసన దీక్ష’’ పేరుతో టీఆర్ఎస్ దీక్ష చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్షలో పాల్గొన్నారు. ధాన్యం సేకరణలో ఒకే విధానం ఉండాలనే డిమాండ్తో దీక్ష చేపట్టారు. టీఆర్ఎస్ దీక్షలో రైతు నేత రాకేశ్ తికాయత్ పాల్గొన్నారు.