ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవాలి
ABN , First Publish Date - 2022-06-25T05:24:46+05:30 IST
మండలంలోని ఆయా గ్రామాలకు గర్భవతులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేయించుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ రమేష్ అన్నారు.
భీమ్గల్, జూన్23: మండలంలోని ఆయా గ్రామాలకు గర్భవతులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేయించుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ రమేష్ అన్నారు. మండలంలోని గోనుగొప్పుల, బెజ్జోర గ్రామంలో శుక్రవారం భీమ్గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ, ఆశలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పించి, రివ్యూ నిర్వహించారు. మాత శిశు సంరక్షణ సమితి సభ్యులు శ్రీరామ్ వసంత్కుమార్, కృష్ణమూర్తి, సాయి, భీమ్గల్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ సుచరిత మాట్లాడారు. ఆర్మూర్లో 24గంటలు అన్ని రకాల సేవలతో పాటు డెలివరీ చేసేందుకు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో బెజ్జోర సర్పంచ్ కోగురు ప్రతిభ సుమన్, ఉపసర్పంచ్ గంగాధర్, గోనుగొప్పుల సర్పంచ్ రాగి అనసూయ, ప్రవీణ్గౌడ్, లక్ష్మణ్, మారుతి, ఆరోగ్య సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.