బతుకు దెరువుకోసం ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చి...

ABN , First Publish Date - 2021-06-08T18:23:17+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన శివకుమార్‌ బతుకు దెరువుకోసం నగరానికి వచ్చి...

బతుకు దెరువుకోసం ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చి...

  • పగలు డెలివరి.. రాత్రి చోరీ


హైదరాబాద్ సిటీ/మియాపూర్‌ : ద్విచక్ర వాహనాలపై రైడింగ్‌కు అలవాటుపడిన ఓ డెలివరీ బాయ్‌ దాని కోసం దొంగతనాల బాట పట్టాడు. 8 నెలల్లోనే 10 వాహనాలను దొంగిలించాడు. మియాపూర్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ కృష్ణప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్‌ వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన శివకుమార్‌ బతుకు దెరువుకోసం నగరానికి వచ్చి కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులోని ఓ రెస్టారెంట్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. 


పగలు హోటల్‌లో పని చేస్తూ రాత్రిపూట తన దగ్గరున్న నకిలీ తాళాలతో ఇళ్ల ముందు పార్కు చేసిన ద్విచక్రవాహనాలను చోరీ చేసి సరదాగా రైడ్‌ చేసేవాడు. ఈ మధ్య పలు ప్రాంతాల్లో వాహనాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వాహనాల తనిఖీల్లో భాగంగా మియాపూర్‌ బొల్లారం చౌరస్తాలో శివకుమార్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో పది ద్విచక్రవాహనాలను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకుని అతడిని రిమాండ్‌కు తరలించారు. అతనిపై కేపీహెచ్‌బీ, మియాపూర్‌, గచ్చిబౌలి తదితర పోలీ్‌సస్టేషన్ల పరిధిలో కేసులు నమోదైనట్లు తెలిపారు. 

Updated Date - 2021-06-08T18:23:17+05:30 IST