108 వాహనంలో కాన్పు
ABN , First Publish Date - 2021-04-24T04:04:09+05:30 IST
108 వాహనంలోనే సిబ్బంది గర్భిణికి సురక్షితంగా కాన్పు చేశారు.
నాయుడుపేట, ఏప్రిల్ 23 : 108 వాహనంలోనే సిబ్బంది గర్భిణికి సురక్షితంగా కాన్పు చేశారు. వివరాలిలా ఉన్నాయి. చిట్టమూరు మండలం కుమ్మరిపాళెం గ్రామానికి చెందిన సునీతకు శుక్రవారం తెల్లవారుజామున నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. ఈఎంటీ గోను రత్నయ్య, పైలెట్ వేమన సురేష్లు సునీతను 108 వాహనంలో ఎక్కించుకొని గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు బయలుదేరారు. మార్గ మధ్యంలో ఆమెకు నొప్పులు ఎక్కువగా రావడంతో ఈఎంటీ రత్నయ్య, పైలెట్ సురేష్లు డాక్టర్ పద్మజకు ఫోన్లో సమాచారం ఇచ్చి వాహనంలోనే సురక్షితంగా కాన్పు చేశారు. ఆమె మగబిడ్డకు ప్రసవించింది. స్థానికులు ఈఎంటీ రత్నయ్య, పైలెట్ సురేష్లను ప్రత్యేకంగా అభినందించారు.