హత్యతో సంబంధం ఉన్నవారిపై కేసు నమోదు చేయాలి
ABN , First Publish Date - 2021-04-12T05:58:45+05:30 IST
హత్యతో సంబంధం ఉన్నవారిపై కేసు నమోదు చేయాలి
గూడూరు రూరల్, ఏప్రిల్ 11 : గూడూరు మండలం భూపతిపేటలో ఈ నెల 6న జరిగిన కుందారపు విక్రమ్ హత్యకేసుతో సంబంధం ఉన్న వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని విక్రమ్ భార్య సుమలత డిమాండ్ చేశారు. ఈ మేరకు గూడూరు బస్టాండ్ ఎదుట గల ప్రధాన రహదారిపై సుమలతతో పాటు బంధువులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ... ‘నా భర్త విక్రమ్ను హత్యచేసిన వారిని వదలొద్దని వేడుకుంది.’ హత్యతో ఐదుగురికి సంబంధం ఉందని, అందులో ముగ్గురుపైనే కేసు నమోదు చేసి అరెస్టు చేశారని పేర్కొన్నారు. మిగతా ఇద్దరిని కూడా అరెస్టు చేసి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై సతీష్ రాస్తారోకో వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని పోలీ్సస్టేషన్కు తరలించారు. రోడ్డుపై కూర్చుంటే సమస్య పరిష్కారం కాదనీ, పోలీ్సస్టేషన్కు వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని ఎస్సై సతీష్ సూచించారు. కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని, పూర్తయ్యేంత వరకు సహకరించాలని ఆమెను కోరారు.