ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్
ABN , First Publish Date - 2021-06-17T04:26:16+05:30 IST
ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్
సీతానగరం, జూన్ 16: తమ సమస్యలు పరిష్కరించాలని స్థానిక పీహెచ్సీ కేంద్రం వద్ద పెదంకలాం కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవో 299ను సవరించి ప్రభుత్వ వైద్య ఉద్యోగులకు చెల్లించే ఎక్స్గ్రేషియా తదితర అంశాలు తమకూ వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొవిడ్తో మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. వారికి స్థానిక వైద్యుడు జగన్మోహన్, సిబ్బంది మద్దతు పలికారు. కార్యక్రమంలో హరికృష్ణ, ప్రసాద్, రాములనాయుడు, చిట్టి కోటేశ్వరరావు, డీవీ సత్యారావు, వెంకటేశ్వరరావు, చంద్రి నాయుడు, భాగ్య తదితరులు పాల్గొన్నారు.