నిర్మాణంలో ఉన్న ఆర్‌బీకే భవనం ధ్వంసం

ABN , First Publish Date - 2022-05-16T06:15:58+05:30 IST

మండలంలోని బైలపూడిలో నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్ర భవనాన్ని గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ధ్వంసం చేసినట్టు సదరు కాంట్రాక్టర్‌ ఈశ్వరరావు ఆరోపించారు.

నిర్మాణంలో ఉన్న ఆర్‌బీకే భవనం ధ్వంసం
బైలపూడిలో ధ్వంసం చేసిన నిర్మాణంలో ఉన్న ఆర్‌బీకే భవనం

  బైలపూడికి చెందిన ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు

 వ్యక్తిగత కక్షతోనే చేశారని విలేఖర్లకు వివరించిన కాంట్రాక్టర్‌  

చీడికాడ, మే 15 : మండలంలోని బైలపూడిలో నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్ర భవనాన్ని గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ధ్వంసం చేసినట్టు సదరు కాంట్రాక్టర్‌ ఈశ్వరరావు ఆరోపించారు. ఆదివారం సాయంత్రం ఆయన ఇక్కడి విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం రూ.21 లక్షలు మంజూరు చేయడంతో ఈ భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి తరువాత తనపై ఉన్న వ్యక్తిగత కక్షతో గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గోడలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో పాటు శనివారం రాత్రి చీడికాడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈ అంశంపై పోలీసులను వివరణ కోరగా, కాంట్రాక్టర్‌ నుంచి ఫిర్యాదు అందినట్టు చెప్పారు. విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామన్నారు. 

Updated Date - 2022-05-16T06:15:58+05:30 IST