డెంగ్యూ నివారణపై ర్యాలీ
ABN , First Publish Date - 2022-07-02T03:19:14+05:30 IST
అనంతసాగరంలో జాతీయ డెంగ్యూ నివారణ మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం వైద్యసిబ్బంది ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. దోమ
అనంతసాగరం, జూలై 1: అనంతసాగరంలో జాతీయ డెంగ్యూ నివారణ మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం వైద్యసిబ్బంది ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. దోమలు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పీహెచ్సీలో సిబ్బందితో సమావేశం నిర్వహించి, ఈనెల 31వతేదీ వరకు డెంగ్యూ నివారణ చర్యలపై ప్రతేక కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యాధికారి వరలక్ష్మి సూచించారు.